ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 10 : అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామానికి చెందిన రైతులు బర్రె జంగయ్య, జక్కుల ఆంజనేయులు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన రైతు బీమా చెక్కులను బుధవారం లబ్ధిదారు కుటుంబ సభ్యులకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వం రైతు బీమా కింద రూ.5లక్షలు అందజేసి ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సర్పంచ్ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బుగ్గ రాములు, టీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రాజు, వార్డు సభ్యులు కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, వీరయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి..
యాచారం, నవంబర్10 : టీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మల్కీజ్గూడ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బధవారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన బుగ్గరాములు, రాఘవేందర్, వినోద్కుమార్, నరేశ్, సురేశ్, రాజు తదితరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రాజు నాయకులు లింగారెడ్డి, శంకర్, మల్లేశ్, అబ్బయ్య, పాండు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ
ఇబ్రహీంపట్నం, నవంబర్ 10 : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన దుర్గం భాస్కర్యాదవ్కు రూ.60వేల సీఎం సహాయనిధి చెక్కును క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిషన్గౌడ్, మండల యువత ప్రధాన కార్యదర్శి వెంకటేశ్యాదవ్, నాయకులు జంగయ్యయాదవ్, యాదయ్య, ప్రవీణ్కుమార్గౌడ్ పాల్గొన్నారు.
12న మహాధర్నా
ఇబ్రహీంపట్నం, నవంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 12న నియోజకవర్గ కేంద్రంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రకటించారు. కేంద్ర పాలకులు వరిధాన్యం కొనేది లేదని చెబుతుంటే రాష్ట్ర నేతలు డ్రామాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్ ధరలు ఏడేండ్లుగా పెంచి రూ. 5, 10 తగ్గించామనడం ప్రజలను వంచించడమేనన్నారు. 12న నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే మహాధర్నాలో పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.