మద్యం షాపులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మంగళవా రం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 59 మద్యం షాపుల్లో ప్రభుత్వ విధివిధానాల ప్రకారం ఎస్సీలకు 9, గౌడ్లకు 6, ఎస్టీలకు 2 షాపులను కేటాయించినట్లు చెప్పారు. 21 ఏండ్లు నిండిన వారు మా త్రమే షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించిన షాపులకు దరఖాస్తు చేసుకునే వారు తహసీల్దార్ ధ్రువీకరించిన కులం సర్టిఫికెట్లను దరఖాస్తుకు జత చేయాలన్నారు. రూ.2 లక్షలు చలా నా లేదా డీడీని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సై జ్ ఆఫీసర్ పేరిట తీయాలని, 3 ఫొటోలు, పాన్కార్డు, ఆధార్కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, వికారాబాద్లోని స్త్రీ శక్తి భవన్లో ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 11గంటలకు అంబేద్కర్ భవన్లో మద్యం షాపుల డ్రా తీస్తారన్నా రు. జిల్లా పరిధిలో రూ.60 లక్షల స్లాబ్లో 17 మద్యం షాపులు, రూ. 55లక్షల స్లాబ్లో 28, రూ.50లక్షల స్లాబ్లో 14షాపులున్నట్లు ఆయ న తెలిపారు. బ్యాంకు గ్యారంటీ ఏడాది స్లాబ్పై 25 శాతం ఉంటే సరిపోతుందన్నారు. సాధార ణ మద్యంపై 27శాతం, మీడియం, ప్రీమి యం బ్రాండ్లపై 20 శాతం మార్జిన్ ఉంటుందని, అన్ని మద్యం దుకాణాల్లో వాక్ ఇన్ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 134 మద్యం షాపులు
షాబాద్, నవంబర్ 9: రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 6 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని 134 మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవీందర్ తెలిపారు. మద్యం పాలసీ 2021-23 సంవత్సరానికిగాను మద్యం షాపుల్లో కలెక్టర్ అమయ్కుమార్ ఎస్సీలకు 11, ఎస్టీలకు 2, గౌడ కులస్తులకు 25 షాపులను డ్రా పద్ధతిలో కేటాయించినట్లు తెలిపారు. సరూర్నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో గతంలో 114 మద్యం షాపులుండగా, కొత్తగా 20 షాపులు పెరిగినట్లు ఆయన చెప్పారు. దరఖాస్తులను 18వ తేదీ వరకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, ఎల్బీనగర్లో స్వీకరిస్తారని, 20న లాటరీ పద్ధతిలో డ్రా తీస్తారన్నారు.