న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై వేటు పడింది. శుక్రవారం వరకు ఆ ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అజిత్ కుమార్ భుయాన్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాటక్లు ఉన్నారు. మంగళవారం రోజున 19 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్లకార్డులు పట్టుకుని, వెల్లోకి దూసుకువచ్చి నినాదాలు చేస్తున్న ఎంపీలపై చైర్మెన్ చర్యలు తీసుకున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే సస్పెన్షన్కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు.