కొలంబో: లోయర్ ఆర్డర్ పోరాటం కనబర్చడంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ కాస్త కోలుకుంది. ఓవర్నైట్ స్కోరు 113/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్.. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. మయేర్స్ (45), హోల్డర్ (36), రాకీమ్ కార్న్వాల్ (39) రాణించారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌట్ కాగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న విండీస్ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. లంక బౌలర్లలో ప్రవీణ్, రమేశ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజుల పాటు ఇక్కడ వర్షం కురిసే అవకాశం ఉండటంతో మ్యాచ్లో ఫలితం తేలడం కష్టంగా కనిపిస్తున్నది.