అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. మైనస్ డిగ్రీల్లో నమోదు అవుతున్నాయి. షికాగోలో మంచు దట్టంగా కురుస్తున్నది. రైలు పట్టాలపై మంచు పేరుకుపోయి, పట్టాలు సంకోచం చెంది రైలు సర్వీసులకు అంతరాయం కలగకుండా అధికారులు పట్టాల వెంబడి మంటలు పెడుతున్నారు. మంటలంటే నిజమైన నిప్పు కాదు. గ్యాస్ హీటర్ల ద్వారా ప్రత్యేక టెక్నాలజీతో ఇలా పట్టాలను రైలు ప్రయాణాలకు అనుకూలంగా ఉంచుతున్నారు. అందుకే పట్టాలు కాలిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి.