న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఎవరు ఉంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన్ను జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాతే తాను పార్టీ చీఫ్ అయ్యేది లేనిదీ అన్నీ క్లియర్గా తెలుస్తాయని అన్నారు. నేనేమీ చేయాలో అది డిసైడ్ అయ్యానని, దీంట్లో ఎటువంటి గందరగోళం లేదని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్రతో ఈ సుందర దేశం నుంచి కొంచం నేర్చుకుంటానని, ఈ రెండు మూడు నెలల్లో తాను మరింత రాటుదేలే అవకాశాలు ఉన్నట్లు రాహుల్ అభిప్రాయపడ్డారు. నవంబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.