న్యూఢిల్లీ: మత్స్యశాఖకు సంబంధించిన ప్రశ్నను ఇవాళ లోక్సభలో అడిగారు. హర్యానా ఎంపీ సునీతా దుగ్గల్ ఆ ప్రశ్నను వేశారు. మత్స్య సంపద ఉత్పత్తి కోసం ఏదైనా స్కీమ్ను ప్రవేశపెట్టారా అని ఎంపీ సునీతా ప్రభుత్వాన్ని అడిగారు. ఆ ప్రశ్నకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తాను హార్ట్ అయినట్లు తెలిపారు. మత్స్యశాఖకు సంబంధించి రాహుల్ గాంధీ ఫిబ్రవరి రెండవ తేదీన ఓ ప్రశ్న వేశారని, ఆ తర్వాత ఆయన పుదుచ్చేరి, కొచ్చిలో జరిగిన సభల్లో మాట్లాడుతూ.. తాము అధికారంలోకివ వస్తే మత్స్యశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. రాహుల్కు జ్ఞాపక శక్తి తగ్గిందనుకుంటా.. లేదంటే మరెందుకు అలా మత్స్య మంత్రిత్వశాఖ గురించి మాట్లాడారని మంత్రి ప్రశ్నించారు. మత్స్యశాఖ గురించి మరి ఎవరు ప్రశ్న వేశారని మంత్రి గిరిరాజ్ .. కాంగ్రెస్ నేత అధిర్ను అడిగారు. మత్స్య సంపద అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి సభకు వివరించారు.