హైదరాబాద్: ఒలింపిక్ చాంపియన్ పీవీ సింధు ఊబర్ కప్ ఫైనల్ టోర్నీలో కొరియా దేశంతో జరిగిన మ్యాచ్లో 0-5 తేడాతో నాలుగవ నెంబర్ క్రీడాకారిణి ఆన్ సియోంగ్ చేతిలో ఓటమి పాలైంది. బ్యాంకాక్లో ఈ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. కెనడా, అమెరికా దేశాలపై వరుస విజయాలు సాధించిన పీవీ సింధు బృందం.. కొరియాతో జరిగిన టీమ్ గేమ్లో ఘోరంగా ఓడింది. అయిదు మ్యాచుల్లో ఇండియన్ జట్టు ఒక్క దాంట్లో కూడా గెలవలేదు. కొరియా చేతిలో 0-5 తేడాతో ఓడినా.. ఇండియా మాత్రం క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఇప్పటికే ఖాయం చేసుకున్నది. ఆన్ సియోంగ్ చేతిలో 15-21, 14-21 స్కోర్ తేడాతో సింధు ఓడింది. ఆన్ చేతిలో సింధు వరుసగా ఓడడం ఇది అయిదోసారి. శృతి మిశ్రా, సిమ్రన్ సింఘి జంట కూడా కొరియా జంట చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఆకర్షి కశ్యప్ కూడా 10-21, 10-21 స్కోర్ తేడాతో కిమ్ చేతిలో ఓడారు.