కేతేపల్లి, మార్చి 23 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కొర్లపహాడ్, ఇప్పలగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కేంద్రం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీ ప్రభుత్వంపై రైతులతో కలిసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 మందికి ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిరుమర్తి పంపిణీ చేశారు. కార్యక్రమం లో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ కె.సైదిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, సర్పంచులు బి.శ్రీనివాస్యాదవ్, ఎడ్ల పార్వతమ్మ, డి.వీరయ్య, కె.శ్రవణ్కుమార్, కె.సరితాసైదులుగౌడ్, ఎంపీటీసీ ఎడ్ల సంధ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముట వెంకన్న యాదవ్, కె.ప్రదీప్రెడ్డి, వి.చేతన్కుమార్ పాల్గొన్నారు.
కట్టంగూర్(నకిరేకల్): నేతన్నలకు ఆర్థికభరోసా ఇచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నకిరేకల్లో జరిగిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం 80వ సాధారణ మహాసభకు హాజరై మా ట్లాడారు. చేనేత కార్మికుల సమస్యలను జౌళి శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మీనర్సయ్య, గంజి ఎల్లయ్య, జనార్దన్, మల్లయ్య పాల్గొన్నారు.