హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినయ్..ఈటల రాజేందర్ తన స్వార్థం కోసం టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తేనే కదా..కేసీఆర్ సార్ ఆయనకు ఏం తక్కువ చేసిండు. అన్ని ఎక్కువనే చేసిండు..ఒక తమ్ముడిగా భావించి మంచి స్థానం ఇచ్చిండు. మంచి మంచి శాఖలు అప్పజెప్పిండు. కానీ ఈటల తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని కూల్చే కుట్రజేసిండు. ఇప్పుడు బయటకు వచ్చి బీజేపీల జేరిండు. నేను ఈటల రాజేందర్ను అడుగుతున్నా అసలు నీకెందు ఓటెయ్యాలె.
బీజేపీని చూసి ఓటెయ్యమంటవా? పెట్రోల్ రేట్ పెంచినందుకు ఓటెయ్యాల్నా..? డీజిల్, గ్యాస్, నూనెల రేట్లు పెంచినందుకు ఓటెయ్యమంటవా?..బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి గిన్ని రోజులైతున్నది. ఏమన్నా అభివృద్ధి చేసిండా? రూపాయి పనిగూడ జేయలేదు. ఏమన్నంటే హిందుత్వం అంటరు.. ఎవరు హిందువులుగాదు.. అందరూ హిందువులే..మతం పేరుచెప్పి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. దళితులకు మోసం చేస్తున్నరు. కేసీఆర్ దళితబంధు ఇస్తానంటే దొడ్డిదారిన ఆపే ప్రయత్నం చేస్తున్నరు. కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలు పెట్టిండు..అన్ని వర్గాలను ఆదరిస్తున్నడు. కేసీఆర్ అంటే ఇప్పుడు దేవుడు. దళితులు పనిజేసుకుందామంటే బయట రూపాయి ఇచ్చేటోళ్లు లేరు. కానీ కేసీఆర్ ఇంటికి పది లక్షలు ఇస్తుండు. దాన్నిగూడ బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం జేస్తున్నరు. దళితులంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. కొందరు చేసే చిల్లర ప్రచారాలను ఎవరూ నమ్మరు. హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నడు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించి కేసీఆర్కు హుజూరాబాద్ ప్రజలు కానుకగా ఇవ్వనున్నారు.
-చంద మల్లిబాబు, హుజూరాబాద్