అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, కక్ష సాధింపు ధోరణిలు ఎండగట్టేందుకు ఈనెల 28న బీజేపీ ఆధ్యర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు , బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వారు ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా ఆశించిన స్థాయిలో నిధుల వాడకం, అభివృద్ధి జరుగడం లేదని ఆరోపించారు.
వచ్చిన నిధుల్లో అక్రమాలకు పాల్పడుతుండడం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. మొన్నటి వరకు పరిశ్రమల వారిని బెదిరించిన వైసీపీ నాయకులు నేడు సినీ పరిశ్రమను బెదిరిస్తూ తనిఖీల పేరిట వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.