తిరువనంతపురం: కేంద్రప్రభుత్వం, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వైఖరులను ఎండగడుతూ అధికార ఎల్డీఎఫ్ కూటమి గురువారం రాజ్భవన్ వద్ద ధర్నా నిర్వహించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా కేరళను కట్టడి చేస్తున్నదని ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ ఆరోపించారు. గవర్నర్ కూడా కాషాయ పార్టీ విధానాలను అనుసరిస్తున్నారని, శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడం లేదని అన్నారు.