గువాహటి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ గత రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రియాంకాగాంధీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్నిచోట్ల ఓటర్లతో కలిసి నృత్యాలు చేశారు. తాజాగా ఇవాళ ఓ తేయాకు తోటలో ప్రియాంకాగాంధీ ప్రత్యక్షమయ్యారు. అక్కడ కూలీలతో కలిసి ఆమె తేయాకు సేకరించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.