న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాక్సులో ప్రధాని నరేంద్రమోదీ ఓటేశారు. కేంద్ర మంత్రులు కూడా అక్కడే ఓటేశారు. ఇవాళ్టి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అసెంబ్లీల్లో ఓటేసిన సీఎంలు
ఇక వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు తమ తమ అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నో అసెంబ్లీలో ఓటేశారు. బెంగాల్ ఎమ్మెల్యేలు కోల్కతాలోని అసెంబ్లీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఓటేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్లో ఓటు వేశారు. ఇంఫాల్లోని మణి పూర్ అసెంబ్లీలోనూ ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ఉంటుంది.
భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓటేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో ఓటేశారు. ఏపీ సీఎం జగన్ కూడా అమరావతిలోని అసెంబ్లీలో ఓటేశారు. భోపాల్లో ఉన్న అసెంబ్లీలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓటేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడుతున్న విషయం తెలిసిందే.