హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తండ్రివలె మనసుపెట్టి ఆలోచించే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో సోమవారం ఆరోగ్య లక్ష్మి పాలు, ఆరోగ్యలక్ష్మి మొబైల్ యాప్ను మహిళా సహకార, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ కలిసి మంత్రి ఆవిష్కరించారు.
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొత్త సంవత్సరంలో మహిళల ఆరోగ్యం కోసం పాటుపడే పాలను, అంగగన్వాడీ సేవలను పటిష్టం చేసే ఆరోగ్య లక్ష్మి మొబైల్ యాప్ ను ఆవిష్కరించుకోవడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లులకు ఇచ్చే పాలు పక్క దారి పట్టవద్దనే ఆరోగ్యలక్ష్మి పేరుతో పాల ప్యాకెట్లు ముద్రించి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
కమిషనర్ దివ్య చాలా మనసు పెట్టి పని చేస్తున్నారు. లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా సమర్థవంతంగా పనులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. దేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే అంగగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు, తల్లులకు పాలు ఇస్తున్నాయి.
సీఎం కేసిఆర్ తండ్రివలె ఆలోచించి రాష్ట్రంలోని పేదలకు అంగగన్వాడీల ద్వారా మేలు జరుగేలా పని చేస్తున్నారని తెలిపారు. మనమంతా మనసు పెట్టి పని చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఆకుల లలిత మాట్లాడుతూ..తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో మహిళా ప్రాంగణాలు ఉన్నాయి. వీటిని విస్తరించడం, మహిళకు మరింత ఉపాధి కల్పించే కొత్త కోర్సులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నామని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు లక్ష్మి, సునంద, కార్పొరేషన్ సంయుక్త సంచాలకులు సబిత, టి.ఎస్ ఫుడ్స్ ఉన్నతాధికారులు విజయలక్ష్మి, కృష్ణవేణి, శ్రీనివాస్ నాయక్, ఎన్.ఐ.సి రాష్ట్ర హెడ్ రాజశేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.