యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నది. మహా కుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధానాలయం పనులు పూర్తికాగా భక్తుల వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. త్వరలో ప్రతిష్ఠించనున్న కలశ స్థాపనకు పరంజా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఐదు క్యూ కాంప్లెక్స్ల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్ బేలు, కమాండ్ కంట్రోల్ రూం, స్వాగత తోరణాల నిర్మాణాలు మరికొద్ది రోజుల్లో పూర్తి చేయనున్నారు. కొండపైన పడిన వర్షం నీటిని వినియోగించుకునే విధంగా భారీ సంపును నిర్మిస్తున్నారు. స్వామివారి దివ్య గాలిగోపురం వద్ద గ్యాస్ ప్లాంటుకు పచ్చదనం ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టారు.
యాదాద్రి, మార్చి 2 : మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయం పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రధానాలయం పనులు పూర్తికాగా, భక్తుల వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు. కలశస్థాపనకు కావాల్సిన పరంజా పనులు పూర్తికావచ్చాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి క్యూ కాంప్లెక్స్లో మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నామని అధికారులు తెలిపారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం పునర్నిర్మాణ పనులు మరింత పటిష్టంగా చేపడుతున్నారు. ప్రతి నిర్మాణం చక్కటి ఆకృతులతో నిర్మిస్తున్నారు. భక్తులకు వసతుల కల్పనతో పాటు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయి. కొండపై ఇప్పటికే 11 ఫ్లాట్ ఫాంలు కలిగిన రెండు బస్ బేలు, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్, స్వాగత ఆర్చ్ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. వర్షపు నీళ్లు సంపులోకి వెళ్లేందుకు, సంపునీళ్లు కొండ కిందికి వెళ్లేందుకు పైపులైన్ పనులు సాగుతున్నాయి.
భక్తుల క్యూ కాంప్లెక్స్ను సకల వసతులతో తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 4 క్యూ కాంప్లెక్సుల్లో మూడింట సాధారణ భక్తులు, మరో కాంప్లెక్స్లో వీఐపీలకు అవకాశం కల్పించనున్నారు. స్టెయిన్లెన్ స్టీల్ రెయిలింగ్ నిర్మించారు. ఒక్కో కాంప్లెక్స్లో 600 మం ది వేచి ఉండొచ్చు. వేచి వున్న భక్తులకు స్నాక్స్, మంచినీళ్లు, అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్యూ కాంప్లెక్స్లో మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా 26 మరుగుదొడ్లను ని ర్మించారు. అగ్ని ప్రమాదాలను వెం టనే అదుపులోకి తీసుకువచ్చేలా అ ధునాతన ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచారు.
యాదాద్రి ఆలయం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురం, తూర్పు త్రితల రాజగోపురం, గర్భాలయ దివ్యవిమాన గోపురాలపై కలశ స్థాపన చేయనున్నారు. మొత్తం 126 బంగారు కలశాల స్థాపన పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం పరంజా పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కలశస్థాపన తర్వాత మార్చి 28న సంప్రోక్షణ చేయనున్నామని వెల్లడించారు.