న్యూఢిల్లీ, మే 5: హైదరాబాద్ నుంచి చండీగఢ్కు బయల్దేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగటం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్లోని షహీద్ భగత్సింగ్ విమనాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం క్యాబిన్లో పొగను గుర్తించటంతో అధికారులు అప్రమత్తమై అత్యవసర భద్రతా చర్యల్ని చేపట్టారు.
అత్యవసర ైస్లెడ్లను ఉపయోగించి విమానంలోని ప్రయాణికులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అత్యవసర తరలింపు సమయంలో ఒక ప్రయాణికుడు గాయపడ్డట్టు తెలిసింది. తన పవర్బ్యాంక్లో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని ఒక ప్రయాణికుడు విమాన సిబ్బందికి తెలుపటంతో, విమానంలోని 198 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని అత్యవసరంగా కిందకు దించారు. విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే.. విమానం క్యాబిన్లో పొగ నిండిపోవటం, ఆ వెంటనే అలారం మోగటం టెన్షన్ వాతావరణాన్ని తీసుకొచ్చింది.