పెద్దపల్లిటౌన్/సుల్తానాబాద్, జనవరి 14 : పెద్దపల్లి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఐదుగురిని పోలీసులు శుక్రవారం పట్టుకొన్నారు. సుల్తానాబాద్ చెరువుకట్ట వద్ద తనిఖీలు నిర్వహించగా కాల్వశ్రీరాంపూర్కు చెందిన చల్లా రాయమల్లు, బసంత్నగర్ జీడీనగర్ వాసి కొమిరె రాజు, కాల్వశ్రీరాంపూర్కు చెందిన దారంగుల వెంకటి నుంచి దాదాపు రూ.77,400 నకిలీ నోట్లు, రూ.4 లక్షల విలువైన ప్రింటర్ ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్టు వారు ఇచ్చిన సమాచారం మేరకు కరీంనగర్కు వెళ్లి దుగ్యాల అనిల్, పెండం సురేశ్లను అదుపులోకి తీసుకున్నారు.