అమరావతి: ఆన్లైన్ ద్వారా నకిలీ పోలీసులపేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ల ను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలోని బి.మఠం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే యువతిని గంటలో నగదు తిరిగి చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారు నేరగాళ్లు. ఆమె వద్ద నుంచి 40 వేల రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేయించుకున్నారు నకిలీ పోలీసులు.
వారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో జగదీశ్వరి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన కడప జిల్లా సైబర్ పోలీసులు ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ మోసగాళ్ళను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ గతంలో పలు సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ దేవా ప్రసాద్ తెలిపారు.