ఢిల్లీ,జూలై:హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.హైతీ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య,ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై దాడి జరగడం నాకు చాలా బాధ కలిగించింది. మోయిజ్ కుటుంబానికి,హైతీ ప్రజల కు ఇదే నా సంతాపం ’’ అని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నారు.