న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు దేశ ప్రజలకు 75 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు పౌరుల్లో కొత్త శక్తిని, కొత్త చైతన్యాన్ని నింపాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ‘ ఆజాది కా అమృత్ మహోత్సవం’ ఈ సంవత్సరం దేశ ప్రజల్లో కొత్త శక్తిని, కొత్త చైతన్యాన్ని నింపాలి. జై హింద్!’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మరికొద్దిసేపట్లో ఆయన ఎర్రకోటకు చేరుకొని ప్రందాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు. జాతీయ జెండాను ఎగుర వేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.