న్యూఢిల్లీ : వచ్చే నెలలో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు. అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జీ7 సమ్మిట్కు వెళ్లకూడదని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సదస్సు వచ్చే నెల 11-13 తేదీల్లో యూకే కార్న్వాల్లో జరుగనున్నది. ఈ సమావేశానికి మోదీతోపాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా దేశాల నాయకులను ప్రత్యేక ఆహ్వానితులుగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు.
‘జీ 7 శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చేసిన ఆహ్వానాన్ని మోదీ అభినందించారని పీఎంఓ తెలిపింది. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న కొవిడ్ పరిస్థితిని బట్టి వ్యక్తిగతంగా జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకూడదని మోదీ నిర్ణయించారు అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.
మే 8 న జరిగిన ఇండియా-ఈయూ సదస్సులో పాల్గొనడానికి పోర్చుగీస్ నగరమైన పోర్టోకు మోదీ తన పర్యటనను విరమించుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ సమావేశం ఆహ్వానం అందింది. మోదీ గైర్హాజరుతో పోర్చుగీస్ సమావేశం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.
ఈ నెల 3-5 తేదీల్లో లండన్లో జరిగిన జీ 7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రిటన్ సందర్శించారు. కాని, ఇద్దరు సభ్యులు కొవిడ్-19 కు పాజిటివ్గా తేలడంతో జైశంకర్తో పాటు బృంద సభ్యులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది భారతదేశం-యూకే మధ్య ద్వైపాక్షిక పర్యటనల షెడ్యూల్ను కూడా ఈ కరోనా మహమ్మారి ప్రభావితం చేసింది. జాన్సన్ రెండుసార్లు భారతదేశాన్ని సందర్శించాల్సి ఉండగా.. కరోనా కారణంగా విరమించుకున్నాడు. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 25 న ప్రారంభం కానున్న పర్యటనను రద్దు చేసుకున్నారు.
మోదీ-జాన్సన్ ఈ నెల 4 న వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమయంలో వారు మెరుగైన వాణిజ్య భాగస్వామ్యం, మొబిలిటీ అండ్ మైగ్రేషన్ పార్టనర్షిప్పై అవగాహనకు వచ్చారు. వచ్చే దశాబ్దంలో ద్వైపాక్షిక సంబంధాలను పెంచడానికి రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు.
తేహ్రీలో ఆకస్మిక వరదలు.. పెద్ద ఎత్తున నష్టం
1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
క్వాడ్లో చేరడంపై బంగ్లాదేశ్ను హెచ్చరించిన చైనా
తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్
పర్షియన్ గల్ఫ్లో యూఎస్-ఇరాన్ మళ్లీ ముఖాముఖి
10 వేల మందికి బయో బబుల్ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్
రష్యాలో పాఠశాలపై కాల్పులు: 13 మంది దుర్మరణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..