హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్ నాంపల్లి, హైదరాబాద్ గౌరవ చైర్పర్సన్, సెషన్స్ జడ్జి కే సాయిరమాదేవి కోరారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. చెకు బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిషరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ అత్యంత సమర్థ వేదిక అని అన్నారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ పి. సామ్ కోశీ ఆదేశాల మేరకు.. సభ్య కార్యదర్శి పంచాక్షరి సూచనలతో ఈ నెల 18న మనోరంజన్ కాంప్లెక్స్ నాంపల్లి, సికింద్రాబాద్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉండి అర్హత కలిగిన అన్ని సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్కు విస్తృతంగా రిఫర్ చేయాలని, బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను రాజీకి ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీ అరుణ కుమారి పాల్గొన్నారు.