హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సోమవారం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నేపథ్యంలో.. వైరస్ నియంత్రించేందుకు ప్లాట్ ఫాం టికెట్ల రేట్లను ముందు జాగ్రత్త చర్యగా తాతాల్కికంగా అధికారులు గతంలో పెంచారు. ప్రస్తుతం డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో (నాన్ సబర్బన్, సబర్బన్) ప్లాట్ఫాం టికెట్ ఛార్జీలు రూ.10కి తగ్గనున్నాయి. అయితే.. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ప్లాట్ఫారం ధర రూ.20 ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అన్ రిజర్వుడు ఎక్స్ప్రెస్, సాధారణ రైళ్లను తిరిగి ప్రారంభించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా అన్ని కొవిడ్-19 ప్రొటోకాల్స్ను పాటించాలని ప్రయాణికులను కోరింది.