వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక వ్యవస్థను పునర్నించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు చేపట్టారు. ప్రతిష్ఠాత్మక 2 ట్రిలియన్ డాలర్ల ప్రాజెక్టును ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇందుకోసం పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్ట్ కింద దేశంలో 20 వేల మైళ్ల పొడవైన రోడ్లు, 10 వేల వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
నీటి సరఫరా కోసం కూడా కొత్త పైపులు ఏర్పాటుచేయనున్నారు. వీటితో పాటు అనేక ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం తన ప్రణాళికలను వెల్లడించింది. వీటి ద్వారా దేశంలో పెద్ద సంఖ్య ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నమ్ముతున్నారు. ఇవి దీర్ఘకాలంలో అమెరికన్ పోటీని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
అమెరికాలోని పెద్ద కంపెనీలపై పన్నులు పెంచడం ద్వారా 2 ట్రిలియన్ డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. మొత్తం అమెరికన్ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే అధ్యక్షుడి రెండు దశలలో ఇది మొదటిదిగా పేర్కొంటున్నారు.
మొత్తం ప్రణాళిక అమలుకు దశాబ్దం కాలంలో సుమారు 4 ట్రిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ‘అమెరికన్ జాబ్స్ ప్లాన్’ అని పేరు పెట్టింది. దీనికింద పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టనున్నట్లు వైట్ హౌస్ అధికారులు చెప్తున్నారు.
ఈ పథకం కింద పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఖర్చు చేస్తారు. రవాణా, బ్రాడ్బ్యాండ్, ఎలక్ట్రిక్ గ్రిడ్, హౌసింగ్, ముందస్తు తయారీని ప్రోత్సహించే ప్రయత్నాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ఇవి కాకుండా లక్షలాది మంది కార్మికులు, కార్మిక సంఘాల శిక్షణతో పాటు వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి కూడా నిధులు ఖర్చు చేయనున్నారు. చైనాతో అమెరికాకు పెరుగుతున్న శతృత్వానికి లింక్గా చాలా మంది అమెరికా ఆర్థిక నిపుణులు దీనిని చూస్తున్నారు.
పరిశోధన, అభివృద్ధి కోసం 180 బిలియన్ డాలర్లు, రోడ్లు, వంతెనల కోసం 115 బిలియన్ డాలర్లు, ప్రజా రవాణాకు 85 బిలియన్లు, ఆమ్ట్రాక్, ఫ్రైట్ రైలుకు 80 బిలియన్లు, ఓడరేవులు, విమానాశ్రయాలకు 42 బిలియన్లు, బ్రాడ్బ్యాండ్ కోసం 100 బిలియన్లు, నీటి మౌలిక సదుపాయాల కోసం 111 బిలియన్లు ఖర్చు చేయనున్నారు. సీసం పైపుల నుంచి నీరు సరఫరా జరుగకుండా కొత్త పైపుల ఏర్పాటుకు 45 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రాజెక్టులో పేర్కొన్నారు.
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి
ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..