కాన్పూర్: ఐఐటీ కాన్పూర్లో పీహెచ్డీ చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి తన రూమ్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ సింగ్ రూమ్ లోపలి నుంచి లాక్ అయి ఉందని, ఎన్ని సార్లు తలుపు తట్టినా అతను ఓపెన్ చేయడం లేదని భద్రతా సిబ్బందికి ఓ విద్యార్ధి ఫిర్యాదు చేశాడు. అయితే కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. బెడ్ షీట్తో సీలింగ్కు ప్రశాంత్ ఉరి వేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇన్స్టిట్యూట్లోని హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లిగా అతను మరణించినట్లు ఫిజీషియన్ ద్రువీకరించారు. విద్యార్థి పేరెంట్స్కు మరణ వార్తను చేరవేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం కేసును విచారిస్తోంది. ప్రశాంత్ మృతి పట్ల ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు నివాళి అర్పించారు.