న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు రానంత వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతూ వచ్చాయి. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే పెంపు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎన్నికలు లేని సమయాల్లో తమ ఇష్టానుసారం చమురు ధరలు పెంచేసే మోదీ సర్కార్.. ఎన్నికలు వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ యథావిధిగా పెట్రోల్, డీజిల్ ధరలు తిరిగి పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, డైరెక్టర్ పబ్లిక్ ఫైనాన్స్ సునీల్ కుమార్ సిన్హా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతంలో కూడా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయిల్ కంపెనీలు ధరలను రివైజ్ చేయడం ప్రారంభించాయని గుర్తుచేశారు. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయిల్ కంపెనీలు లీటర్కు రూ.8 నుంచి రూ.9 పెంచే అవకాశం ఉన్నదని డెలాయిట్ టచ్ టోమట్సు ఇండియా సంస్థ అంచనా వేసింది.