హైదరాబాద్: గత 9 ఏళ్ల నుంచి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పని చేశారని, రైతులు కూడా సీఎం కేసీఆర్ను విశ్వసిస్తున్నారని, రైతుల కోసం కేసీఆర్ మొదలుపెట్టిన బీమా పథకాన్ని.. ప్రధాని మోదీ కూడా కాపీ కొట్టారని, ఇంత కన్నా విశ్వసనీయమైన అంశం ఏమీ ఉండదని, మూడవ సారి కూడా కేసీఆర్ను ప్రజలు సీఎంగా ఎన్నకుంటారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) అన్నారు. ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తామన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తమ పార్టీ త్వరలోనే మ్యానిఫెస్టో ప్రకటించనున్నట్లు అసద్ అన్నారు. తమ అభ్యర్థుల వివరాలను కూడా వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.
#WATCH | Telangana elections | AIMIM president Asaduddin Owaisi says, “People trust that he (CM KCR) has worked for farmers in 9 years. He started the insurance initiative for farmers which was copied by PM Modi. So, it is a major trust factor…I think the public will elect KCR… pic.twitter.com/sokcLEPbL2
— ANI (@ANI) October 16, 2023