వీణవంక, జూన్ 29: అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదం చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. సీఎం పదవి తప్పా అన్ని పదవులు అనుభవించిన ఈటల.. ఆత్మగౌరవ పేరుతో బీజేపీలో చేరాడని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా పూర్తిచేయలేదని, ఒక్క ఇంట్లో కూడా గృహ ప్రవేశం చేయించలేదని మండిపడ్డారు. రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నది సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అందరూ కలిసి కట్టుగా పనిచేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ సూచించిన వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్కు చెందిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాడి తిరుపతిరెడ్డి, వల్బాపూర్ ఎంపీటీసీ జీడి దేవేందర్, నర్సింగాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ రవీందర్యాదవ్, వార్డు సభ్యులు రాజిరెడ్డి కుమార్, కండె మహేందర్, రవీందర్, మల్లన్నపల్లికి చెందిన కలకొండ మధుకర్రెడ్డి, నారాయణరెడ్డి, కోర్కల్ సింగిల్ విండో మాజీ డైరెక్టర్ గంగారెడ్డి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేటలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి హరీశ్రావు గులాబీ కండువాలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నదని తెలిపారు. హుజూరాబాద్ నియోకవర్గంలో ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, పార్టీలో చేరిన వారంతా పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మాడ సాదవరెడ్డి ఉన్నారు.