జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పనులు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని, కారు గుర్తుకు ఓటు వేసి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు.
కుల మతాలకు అతీతంగ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నాడని అన్నారు. దేశం లోనే ఎక్కడ లేని విధంగ ఇవ్వాల తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. సరిహద్దు రాష్ట్రాలవారు తెలం గాణ రాష్ట్రంలో కలుస్తామని చెబుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం ఏ స్థాయిలో పని చేస్తుందో అర్ధమవుతుందన్నారు.
అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం దళితబంధు పథకం తెచ్చి అమలు చేస్తుంటే కడుపు మంటతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి బీజేపీ నాయకులు నిలుపుదల చేసి తినే అన్నంలో మన్ను బోసినట్లు చేశారని విమర్శించారు. డైరక్టుగా పోరాడె దమ్ములేక చీకటి పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. ఆయన వెంట జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్, కౌన్సిలర్లు మద్ది లావణ్య, రాజు, శరత్,సురెందర్, రాజమౌళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.