హైదరాబాద్ : ప్రభుత్వం జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడ్జెట్పై మంత్రి స్పందిస్తూ.. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు చేసేదిగా ఉందన్నారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను కొత్తగా ప్రవేశపెట్టి రూ. 1,000 కోట్లు కేటాయించడం హర్షనీయమన్నారు. దళితులు, మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి సీఎం అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఇదొక తాజా నిదర్శనం అన్నారు.
2021-22 బడ్జెట్లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21 వేల 306 కోట్ల 85 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన చూసినా 15.45%( రూ.19 వేల 509 కోట్లు) ఇవ్వాల్సి ఉండగా 16.87% శాతం కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు మైనారిటీల సంక్షేమానికి రూ.1,606 కోట్లు కేటాయించినట్లు వెల్లడించిన మంత్రి ఇది గతం కంటే రూ. 88 కోట్లు అధికమన్నారు. ఆయా వర్గాల తరపును సీఎం కేసీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.