హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు.. విద్యార్థులు ఫీజులే కాకుండా.. జరిమానాలు సైతం చెల్లించాలని హుకుం జారీచేస్తున్నాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు నోటీసులు జారీచేసింది. ఫీజు చెల్లించని వారు ట్యూషన్ ఫీజుతోపాటు రోజుకు రూ.50 చొప్పున జరిమానా చెల్లించాలని, లేదా క్లాసులకు అనుమతించబోమని హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో వృత్తి విద్యాకాలేజీలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయరాదని గతంలో ఏఐసీటీఈ ఇచ్చిన ఆదేశాలను చాలా కాలేజీలు పట్టించుకోవడంలేదు.