బెంగళూరు: కరోనా కష్టకాలంలో దాదాపు మూడు నెలలుగా అభిమానులను అలరిస్తూ వచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్కు శుక్రవారం తెరపడనుంది. కొవిడ్-19 కారణంగా వేర్వేరు వేదికల్లో కాకుండా మొత్తం 136 మ్యాచ్లను బెంగళూరులోని బయోబబుల్లోనే నిర్వహించారు. లీగ్ దశలో అదిరిపోయే ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పట్నా పైరెట్స్, దబంగ్ ఢిల్లీ పీకేఎల్ ఫైనల్కు చేరుకున్నాయి.