మల్లాపూర్, ఫిబ్రవరి 3: సమాజ అభివృద్ధిలో యువత తమవంతు భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క ల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేవీఎస్ఆర్ మినీ క్రికెట్ స్టేడియం లో 40 రోజులుగా జరుగుతున్న కేసీఆర్ కప్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, అసలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంది.. ప్రస్తు తం ఎలా మా రిందో యువత గమనించాలని కోరారు. అలాగే క్రీడారంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లావేళలా కృషి చేస్తున్నదని, క్రీడాకారుల సౌకర్యార్థం నియోజకవర్గ వ్యాప్తంగా అందరి సహకారంతో అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే తన సొంత డబ్బులతో పోటీల్లో విజేతగా నిలిచిన ఇబ్రహీంపట్నం క్రికెట్ జట్టుకు రూ.30 వేలు, రన్నరప్గా నిలిచిన కోరుట్ల జట్టుకు రూ.15 వేల నగదుతో పాటు, ట్రోఫీలను అందజేశారు. ఇక్కడ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ ఆకుతోట రాజేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గౌరు నగేశ్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల జీ వన్రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ కా టిపల్లి ఆదిరెడ్డి, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు మేకల సతీశ్, నాయకులు ముద్దం శరత్గౌడ్, క్యాతం జీవన్రెడ్డి, సురేశ్రెడ్డి, బండి లింగస్వామిగౌడ్, బదినపల్లి ప్రేమ్, క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.
పార్టీ బీమా చెక్కు అందజేత
ఓ కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ పార్టీ బీమా చెక్కును అందించారు. చిట్టాపూర్ గ్రామానికి చెందిన గోధూరు శంకర్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెం దాడు. కాగా శుక్రవారం బాధిత కుటుంబాన్ని సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శంకర్ మృతి పార్టీకి తీరని లోటని, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక చొరవతో రూ.2 లక్షల విలువైన ప్రమాద బీమా చెక్కును మంజూరు చేయించి సంబంధిత చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, సింగిల్ విండో మాజీ చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, వైస్ ఎంపీపీ గౌరు నగేశ్, పీఏసీఎస్ చైర్మన్ నేరేళ్ల మోహన్రెడ్డి, ఎంపీటీసీ మైస లక్ష్మి, నాయకులు కట్కం నర్సారెడ్డి, నూతుల లక్ష్మీనారాయణ, బీ రాకేశ్కుమార్, దామోదర్, అంజిరెడ్డి, అశోక్, లక్ష్మీనర్సయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.