మూడో రోజూ ఉద్యమంలా పల్లె, పట్టణ ప్రగతి
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొనసాగుతున్న కార్యక్రమం
ఆదిలాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ, పల్లె ప్రగతి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మూడో రోజైన ఆదివారం జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ వార్డులు, పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ పారిశుధ్యం, పచ్చదనం ఇతర పనులను పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంజయ్నగర్లో ఎమ్మెల్యే జోగు రామన్న.. తాంసి మండలం అంబుగాంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్.. ఉట్నూర్ మండలం హస్నాపూర్లో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రేఖానాయక్.. లోకేశ్వరం మండలంలోని మన్మద్లో రాష్ట్ర పరిశీలకులు నర్సింహులుతో కలిసి ఎమ్మెల్యే విఠల్రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలోని గాజులపేట, వెంకటాద్రిపేటలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేలు హాజరయ్యారు. కుంటాల మండలం ఓలలో పలె ్లప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ : సంజయ్నగర్లో మురుగుకాలువలను పరిశీలిస్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
బోథ్ : మండల కేంద్రంలోని టీ హోటల్ ఎదుట చెత్తను ఏరిపిస్తున్న సర్పంచ్ సురేందర్యాదవ్
నిర్మల్ అర్బన్ : డ్రైనేజీలను పరిశీలిస్తున్న నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
ఖానాపూర్ రూరల్ : బావపూర్లో పనులను పరిశీలిస్తున్న ఎంపీవో చంద్రశేఖర్,గ్రామస్తులు