హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో పాలమూరు జట్టు అదరగొడుతున్నది. మంగళవారం మొదలైన టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ మహబూబ్నగర్ మూడు మ్యాచ్ల్లో గెలిచి ముందంజ వేసింది. పాలమూరు పురుషుల జట్టు తమ తొలి మ్యాచ్లో 25-17, 25-12 తేడాతో ఆదిలాబాద్పై, మిగతా మ్యాచ్ల్లో 25-20, 28-26తో కరీంనగర్పై, 25-19, 24-26, 25-12తో వరంగల్పై విజయాలు నమోదు చేసుకుంది. హైదరాబాద్ జట్టు 25-21, 25-19తో నల్లగొండపై, నిజామాబాద్ 25-16, 25-22తో హైదరాబాద్పై గెలిచాయి. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్, జాగృతి ప్రతినిధులు నవీన్ ఆచారి, రాజీవ్సాగర్ తదితరులు పాల్గొన్నారు.