దుబాయ్: ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ర్యాంకుల్లో ఇండియాను పాకిస్థాన్ వెనక్కి నెట్టివేసింది.తాజాగా వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో దాయాది దేశం ర్యాంకు మెరుగుపడింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పాకింది. ప్రస్తుతం టీమిండియా అయిదో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ స్టార్ట్ కావడానికి ముందు పాకిస్థాన్ అయిదో ర్యాంక్లో ఉండేది. అయితే విండీస్ను 3-0 తేడాతో ఓడించిన పాకిస్థాన్ ఇప్పుడు 106 పాయింట్లతో నాలుగవ ర్యాంక్కు ఫిక్స్ అయ్యింది. ఇండియా ప్రస్తుతం 105 పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచింది.