హైదరాబాద్: ప్రజాసేవే పరమావధిగా భావించే పద్మారావు గౌడ్.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనమని, సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పజ్జన్న నాలుగు దశాబ్దాలుగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని తెలిపారు. 2001 నుంచి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ హైదరాబాద్ మహానగరంలో గులాబీ జెండాని రెపరెపలాడిస్తున్నారని చెప్పారు.
కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా.. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని వెల్లడించారు. ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారని చెప్పారు. పార్లమెంటులో పద్మారావు గౌడ్ గళం.. సికింద్రాబాద్కు బలమంటూ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
🔷 మన బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రజా నాయకుడు పజ్జన్న
🔹ప్రజాసేవే పరమావధిగా భావించే @TPadmaRao గౌడ్ గారు.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనం.. సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషి
🔹పజ్జన్న నాలుగు దశాబ్దాలుగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు
🔹2001 నుండి ఉద్యమ… pic.twitter.com/xAYQB3grB5
— KTR (@KTRBRS) April 26, 2024