పాత వాహనాల డీరిజిస్ట్రేషన్ ప్రారంభించిన ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ: పదేండ్లు దాటిన పాత డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. ఒక్కరోజులోనే దాదాపు లక్షకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆయా వాహనాలకు ఎలక్ట్రిక్ కిట్ ఫిట్ చేసుకోవడం లేదా ఎన్ఓసీ పొందాకే ఇతర రాష్ర్టాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియను కూడా త్వరలో చేపడుతామని ఢిల్లీ రవాణాశాఖ పేర్కొన్నది.