డిస్పూర్ : అస్సాం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగింది. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 82.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 40 నియోజకవర్గాల్లో మూడో విడత ఎన్నికలు జరిగాయి.
337 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర మంత్రి హేమంత బిశ్వశర్మ పోటీ చేసిన జలుక్బారి నియోజవర్గానికి సైతం ఈ విడతలోనే ఎన్నికలు జరిగాయి.
విజయంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్చి 27న అస్సాంలో తొలివిడత ఎన్నికలు జరిగాయి.
ఈ విడతలో 74.76 శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 1న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి