న్యూఢిల్లీ : దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 45కోట్లకుపైగా టీకాలు వేశామని, 18-44 ఏజ్గ్రూప్లో 15.38కోట్లకుపైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం రాత్రి 7 గంటల వరకు అందిన తాతాల్కిక సమాచారం మేరకు ఒకే రోజు 39,42,457 మోతాదులు వేసినట్లు చెప్పింది. ఇందులో 18-44 ఏళ్లలోపు వారికి 20,54,874 మొదటి.. 3,00,099 రెండో మోతాదు అందజేసినట్లు పేర్కొంది. మూడో విడుత టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి 18-44 వయసు వారు 14,66,22,393 మందికి మొదటి, 71,92,485 మంది రెండో మోతాదు వేసినట్లు చెప్పింది. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కోటికిపైగా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. బుధవారం నాటికి టీకా డ్రైవ్ 194వ రోజుకు చేరింది. ఒకే రోజు 39,42,457 టీకాలు వేయగా.. 27,41,794 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 12,00,663 మందికి రెండో మోతాదు అందజేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.