న్యూఢిల్లీ : దేశంలో టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో బుధవారం 18-44 ఏళ్లలోపు 2,30,305 మంది లబ్ధిదారులకు మొదటి డోసు వేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు వారికి 9,02,731 మోతాదులు వేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,24,30,828 మంది లబ్ధిదారులకు టీకాలు వేయగా.. ఇందులో ఆరోగ్య కార్యకర్తల్లో 94,79,901 మందికి మొదటి డోసు.. 63,52,975 మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది.
ఫ్రంట్లైన్ వారియర్స్లో 1,36,49,661 మంది తొలి డోసు, మరో 74,12,888 మందికి రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. 18-44 ఏళ్లలోపు వ్యక్తులకు 9,02,731 మొదటి డోసు వేసినట్లు చెప్పింది. 45-60 ఏళ్లలోపు లబ్ధిదారులకు 5,37,95,272 మందికి మొదటి, మరో 48,29,091 మందికి రెండో మోతాదు అందించినట్లు తెలిపింది. 60 ఏళ్లుపై బడిన వారిలో 5,31,09,064 మందికి మొదటి, 1,28,99,245 మంది లబ్ధిదారులు రెండో డోసు వేసినట్లు చెప్పింది. వ్యాక్సిన్ డ్రైవ్ (మే 5 నాటికి) 110వ రోజు చేరగా.. ఒకే రోజు 18,90,346 మోతాదులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 8,66,423 మందికి మొదటి, 10,23,923 మందికి రెండో డోసు వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.