అమరావతి : ఏపీలో మహిళలను గౌరవించడంలో సీఎం జగన్ కంటే, తమకంటే ఎక్కువగా గౌరవం ఎవరూ ఇవ్వరని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ తరుఫున తలపెట్టనున్న మహిళల ఆత్మగౌరవ యాత్రలపై బొత్స స్పందించారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మంత్రులుగా, జడ్పీచైర్పర్సన్లుగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుగా ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. ఇటీవల అసెంబ్లీ జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా. పొరపాటున జరిగిందా, జరిగితే పునరావృతం కాకుండా చూడాలి తప్పా ..దాన్ని ప్రచారం చేసి గౌరవాన్ని తగ్గించుకోవద్దని చంద్రబాబుకు పరోక్షంగా సూచించారు.
రాజకీయాల్లో సీనియర్ గా వ్యక్తి ఇలాంటి విషయాలపై ప్రజల్లో ప్రచారం చేస్తారా.. అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఘటనను తాను సమర్ధించడం లేదని అంటూనే చంద్రబాబు హయాంలో మహిళలకు జరిగిన అవమానాలను ప్రస్తావించారు. ముఖ్యంగా శాసనసభ్యురాలు రోజాను ఏడాది పాటు సస్పెంట్ చేసి అవమాన పరచాలేదా అన్ని గుర్తుచేశారు. నోరు ఉంది కదాని.. మేము చెప్పిందే కరెక్ట్ అంటే ఎలా వీలవుతుందని బొత్స అన్నారు.