అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్(IPS) అధికారుల బదిలీల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది . 8 మంది సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్(Posting) లు , బదిలీ(Transfers) ల్లో కూడా మార్పులు, చేర్పులు చేసింది. శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీకి హోంగార్డు ఏడీజీ(Home Guard ADG) గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజీగా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో శాంతి భద్రతల డీసీపీగా కృష్ణకాంత్ను, సీఐడీ ఎస్పీగా గంగాధర్రావును, కాకినాడ ఎస్పీ సతీష్కుమార్కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంటుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్గా వి. రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్గా అమిత్బర్దార్, ఇంటెలిజెన్స్ విభాగానికి ఆనందరెడ్డిని బదిలీ చేసింది.