మణుగూరు :తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువు మధ్యలో ఆగిపోయిన వారికి చదువుకునేందుకు అవకాశం కల్పించిందని శ్రీవిద్య విద్యా సంస్థల డైరెక్టర్, ఓపెన్స్కూల్ కో-ఆర్డినేటర్ నూకారపు రమేశ్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అవసరమని ఆగిపోయిన చదువు మళ్లీ కొనసాగించడానికి ఓపెన్టెన్త్, ఇంటర్మీడియట్లలో అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.
అందుకోసం అపరాధ రుసుముతో సెప్టెంబర్ 20 వరకు ఆసక్తి కలిగిన వాళ్ళు శ్రీవిద్య పాఠశాలలో సంప్రదించాలని శ్రీవిద్య విద్యా సంస్థల డైరెక్టర్, ఓపెన్స్కూల్ కో-ఆర్డినేటర్ నూకారపు రమేశ్ పేర్కొన్నారు.