Ooty | ఊటీ: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి పర్యాటకులు ఊటీ వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే వేసవి విడిది కేంద్రమైన ఊటీలోనే ఈ ఏడాది ఎండలు భయపెడుతున్నాయి. ఈ హిల్ స్టేషన్లో ఏప్రిల్ 29న 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.4 డిగ్రీలు ఎక్కువని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
అలాగే మే 1న సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. 1986 ఏప్రిల్ 29న 28.5 డిగ్రీలు నమోదైందని, 38 ఏండ్ల తర్వాత ఆ రికార్డు బద్ధలైందని ఆయన చెప్పారు. అయితే రాత్రి వేళలో మాత్రం వాతావరణం చల్లగానే ఉండటం టూరిస్టులకు ఊరటనిచ్చే విషయం.