సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం.. కటౌట్లకు రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకున్న మహిళలుపారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లకు సన్మానాలుచౌటుప్పల్లో 105 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిభువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.. మోత్కూరులో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. మహిళల సంక్షేమం, సంరక్షణ, స్వావలంబన దిశగా పలు పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు మహిళలు రాఖీలు కట్టి అభిమానం చాటుకున్నారు. మహిళా బంధు వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న మహిళలను సత్కరించారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను, మున్సిపల్, ఏఎన్ఎం సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.