బీబీనగర్ : మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఫిజియాలజీ విభాగం మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఎధోస్ ఆఫ్ బిహేవియల్ – కాంటినమ్ ఇన్ ట్రాన్స్లేషనల్ రీసర్చ్” పై ఆన్లైన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో జంతు ప్రయోగాలు, సాంకేతికలపై ఇ-హ్యాండ్స్తో కలిసి జంతువుల ప్రవర్తనపై అకాడమిక్ ఫెస్ట్ నిర్వహించారు.
వర్క్షాప్లో దేశ వ్యాప్తంగా ఉన్న 300మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, డాక్టర్ లక్ష్మీ న్యూరోఫిజియాలజీ నిమ్హన్స్ బాంగ్లూర్, డాక్టర్ ప్రవీణ్, జెఎస్ఎస్ కాలేజ్, ఊటీ, డాక్టర్ నితిన్ అశోక్ జాన్, డాక్టర్ మాధురి, డాక్టర్ కల్పన, డాక్టర్ రాల్ నరంగ్, డాక్టర్ సంగీత, డాక్టర్ శ్యామల, పిఆర్ఓ అసిస్టెంట్ ప్రొఫెస్సర్ పాల్గొన్నారు.