ఖమ్మం, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. మతాన్ని పెంచిపోషించిన బీజేపీ.. చివరికి శ్రీరాముడిని కూడా బ్యాలెట్బాక్స్ మీదికి తెచ్చిందని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విమర్శించారు. ఓట్ల కోసం ఇంతలా దిగజారిన బీజేపీని ఆ శ్రీరాముడు కూడా క్షమించడన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ అనంతరం మీడియా పాయింట్ వద్ద గురువారం ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ మహిళల మంగళసూత్రాలపై చులకన వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని చెప్పారు. ‘సారే జహాసె అచ్చా’ అంటూ దేశం గర్వించదగిన పాటను రచించినది కూడా ముస్లిమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు.