న్యూఢిల్లీ : విపక్ష ఇండియా కూటమి విభేదాలతో నీరుగారడం దురదృష్టకరమని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా (Omar Abdullah) ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయని, ప్రస్తుతం ఇండియా కూటమి బలంగా లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగే నాలుగైదు రాష్ట్రాల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య భేదాభిప్రాయాలు వాంఛనీయం కాదని పేర్కొన్నారు.
సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య విభేదాలున్నాయని, యూపీలో ఇరు పార్టీలు అన్ని స్ధానాల్లో పోటీ చేస్తామని చెప్పడం ఇండియా కూటమికి మేలు చేయబోదని అన్నారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం తాము మరోసారి భేటీ అవుతామని, అన్ని అంశాలపై చర్చలు సాగిస్తామని చెప్పారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, ఎస్పీ సీట్ల సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గాయి. ఈ విషయంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ తమను వెన్నుపోటు పొడించిందని బాహాటంగానే అఖిలేష్ విమర్శలు గుప్పించడం విపక్ష కూటమి ఇండియా ఐక్యతపై సందేహాలు నెలకొన్నాయి.
Read More :
Bus Driver | తన ప్రాణం పోతున్నా..48 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్